తమిళనాడు రాజధాని చెన్నై అరుదైన రికార్డు నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలో 1.04 కోట్ల మంది ఈ మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చేశారు. ఇది ఎవరూ ఊహించ లేదని మెట్రో నిర్వణ సంస్థ వెల్లడించింది. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) ఇందుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. ఆగస్టు నెలలో చెన్నై మెట్రోలో మొత్తం 1,04,04,098 మంది ప్రయాణించారు. ఇందులో ఆగస్టు 14న అత్యధికంగా ఒకే రోజులో 4,01,607 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేసిన 'సింగిల్-జర్నీ పేపర్ క్యూఆర్ (QR) టిక్కెట్ల' ద్వారా 20,20,687 ప్రయాణాలు జరగగా, స్టేషన్లలో జెనరేట్ చేసిన 'స్టాటిక్ క్యూఆర్ టిక్కెట్ల'ను 2,28,732 మంది ప్రయాణికులు వినియోగించు కున్నారు. టికెటింగ్ విధానాలలో ఎన్సీఎంసీ సింగార చెన్నై కార్డ్ అత్యధికంగా వినియోగించారని మెట్రో సంస్థ తెలిపింది. The post 1.04 కోట్ల మంది ప్రయాణంతో మెట్రో రికార్డ్ appeared first on TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
1.04 కోట్ల మంది ప్రయాణంతో మెట్రో రికార్డ్
తమిళనాడు రాజధాని చెన్నై అరుదైన రికార్డు నమోదు చేసింది. ఒక్క ఆగస్టు నెలలో 1.04 కోట్ల మంది ఈ మెట్రో రైళ్ల ద్వారా ప్రయాణం చేశారు. ఇది ఎవరూ ఊహించ...
By Dhallo News · September 2, 2026 at 8:56 AM IST
Have feedback on this article?Report error or suggestion
